ఏపిలో మరో 57 కేసులు నమోదు
గత 24 గంటల సమయంలో 60 మంది డిశ్చార్జ్
అమరావతి: ఏపిలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 9,038 శాంపిళ్లను పరీక్షించగా మరో57 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల సమయంలో 60 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,157గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 857 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,252 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు ఏపీలో మృతి చెంిన వారి సంఖ్య 48కి చేరింది.
జిల్లాల వారీగా కరోనా వైరస్ కేసుల వివరాలు..
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/