ఏపిలో మరో 837 కొత్త కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,934

coronavirus -ap

అమరావతి: ఏపిలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 38,898 శాంపిళ్లను పరీక్షించగా మరో 837 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 789 మంది ఏపి వాసులు ఉన్నారని వివరించింది. 24 గంటల్లో 258మంది కరోనా నుంచి కోలుకోగా, ఎనిమిది మంది మృతి చెందారు. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు 14,414 కాగా, ఏపిలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 16,934 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 8,082 మంది ఏపి వాసులు చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 6,126 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 206కి చేరింది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/