ఏపిలో మరో 68 కరోనా పాజిటివ్‌ కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,407

Corona-cases-in-Andhra-Pradesh
Corona-cases-in-Andhra-Pradesh

అమరావతి: ఏపిలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. 24 గంటల్లో 9,159 శాంపిళ్లను పరీక్షించగా మరో 68 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 43 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, కర్నూలులో ఒక్కరు మృతి చెందారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,407 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 715 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,639 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 53కి చేరింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/