తెలంగాణ మంత్రి కేటీఆర్కు కరోనా
ట్విట్టర్ ద్వారా వెల్లడి
Hyderabad: తెలంగాణ మంత్రి కేటీఆర్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నానని వెల్లడించారు. ‘స్వల్ప లక్షణాలతో నాకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నాను. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వారంతా కోవిడ్ ప్రొటో కాల్ పాటించి పరీక్ష చేయించుకుని జాగ్రత్తగా ఉండండి’ అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/