మంత్రి బాలినేనికి కరోనా
కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగత సిబ్బందికి కరోనా పరీక్షలు
Ongole: ఎపి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కి కరోనా పాజిటివ్ నిర్దారణైంది.. నిన్న ఆయనకు చేసిన పరీక్షలలో ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది..
దీంతో ఆయన హైదరాబాద్ లోని అపోలోలో చికిత్స కోసం చేరారు.. ఆయన కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తి గత సిబ్బందికి కరోనా పరీక్షలు చేశారు..
అలాగే మంత్రి కాంటాక్ట్ వివరాలను సేకరిస్తున్నారు..
కాగా ప్రకాశం జిల్లాకు చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఆతని కుమారుడు, గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు లు కరోనాతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు..
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/