ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ కు కరోనా

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స

ICMR DG Balaram Bhargava
ICMR DG Balaram Bhargava

New Delhi: దేశంలో కరోనా నియంత్రణకు పోరాడుతున్న భారత వైద్య  పరిశోధన మండలి (ఐసీఎంఆర్)  అధికారి కరోనా బారిన పడ్డారు.

ఐసీఎంఆర్  డీజీ ప్రొఫెసర్ బలరాం భార్గవకు కరోనా సోకింది. లక్షణాలు కనిపించడంతో బలరాం  భార్గవకు పరీక్షలునిర్వహించారు.

ఆ పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.  ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/