ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ కు కరోనా
ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స
New Delhi: దేశంలో కరోనా నియంత్రణకు పోరాడుతున్న భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధికారి కరోనా బారిన పడ్డారు.
ఐసీఎంఆర్ డీజీ ప్రొఫెసర్ బలరాం భార్గవకు కరోనా సోకింది. లక్షణాలు కనిపించడంతో బలరాం భార్గవకు పరీక్షలునిర్వహించారు.
ఆ పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/