మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కు కరోనా
సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స
Lucknow:: భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. చేతన్ చౌహాన్ శుక్రవారం కరోనా పరీక్షలు చేయించుకోగా, టెస్టు రిపోర్టు నిన్న వచ్చింది.
ఈ నేపథ్యంలో, లక్నోలోని ఆయన కుటుంబ సభ్యులకు కూడా అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు.
చేతన్ చౌహాన్ కు లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
లక్షణాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్ విధించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/