సముద్ర నాచుతో కరోనా కట్టడి
రిలయన్స్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ శాస్త్రవేత్తలు వెల్లడి
దిల్లీ: కరోనా వాక్సిన్ కు సంబందించి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానికి చెందిన రిలయన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. సముద్రాల్లో ఉండే పోర్ఫీడియం సల్ఫేటెడ్ రకపు ఎరుపు నాచుకు కరోనా ఇన్ఫెక్షన్లను ఎదుర్కోనే శక్తి ఉందని గుర్తించారు ఈ నాచు ద్వారా ఉత్తత్తి అయ్యే పాలీ శాకరైడ్లు శ్వాసకోస సమస్యలకు కారణమయ్యే కరోనా కుటుంబాలకు చెందిన వైరస్ లను ఎదుర్కోనే బలమైన యాంటీ వైరల్ ఏజెంట్లుగా పనిచేస్తాయని కనిపెట్టారు. ఈ నాచుతో శానిటరీ ఉపకరణాలపై కూడా యాంటీ వైరల్ కోటింగ్ వేయవచ్చని అధ్యయన పత్రంలో వెల్లడించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/