ఎన్టీఆర్ భవన్ లో కరోనా వ్యాప్తి నియంత్రణ ఏర్పాట్లు
చంద్రబాబు సహా అందరికీ థర్మల్ స్కానింగ్
Mangalagiri: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కలవరపెడుతున్న నేపథ్యంలో, మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో కరోనా వ్యాప్తి నియంత్రణ ఏర్పాట్లు చేసారు.
సందర్శకులు,సిబ్బంది అందరికీ కరోనా పై అవగాహన కలిగిస్తున్నారు.
మంగళవారం ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబు సహా అందరికీ థర్మల్ స్కానింగ్ చేశారు..
టిడిపి కార్యాలయంలో ప్రవేశించే ప్రతి ఒక్కరికి థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే లోపలికి పంపుతున్నారు..
స్కానింగ్ అయిన తర్వాత చేతులను శుబ్రం చేసుకునేందుకు శానిటైజేషన్ లోషన్ ఇస్తున్నారు..
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/