జాతీయ క్రీడా పురస్కారాలకు తాకిన కరోనా సెగ
లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన దరఖాస్తుల ప్రక్రియ
న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా కారణంగా క్రీడాలోకం స్థంబించిపోయింది. అయితే తాజాగా ఈ కరోనా సెగ జాతీయ స్థాయిలో ఇచ్చే క్రీడా అవార్డులకు కూడా తాకింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో అవార్డులకు అవార్డులకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఆలస్యం అవుతుంది. సాధారణంగా ఏప్రిల్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి ఆగష్టు 29న క్రీడా దినోత్సవ సందర్బంగా అవార్డులను అందజేస్తారు. కాని ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా స్పోర్ట్స్ ఫెడరేషన్లు అన్ని మూతపడ్డాయి. దీంతో క్రీడా పురస్కారాలలో జాప్యం జరుగుతుంది. కాగా వచ్చే నెలలో దరఖాస్తులు ఆహ్వనించే అవకాశం ఉందని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/