Auto Draft

ఐసోలేషన్‌ నుంచే విధులు

Shakti kanta Das
Shakti kanta Das

New Delhi: రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ కరోనా పాజిటివ్‌కు గురయ్యారు. ఆదివారం ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు..

తనకు ఎలాంటి లక్షణాలు లేవని అయినా పాజిటివ్‌ వచ్చిందన్నారు.. తాను బాగానే ఉన్నానని పేర్కొన్నారు. తాజాగా తనను కలిసినవారిని అప్రమత్తం చేసినట్టు వెల్లడించారు.

ప్రస్తుతం ఐసోలేషన్‌ నుంచే తన పని కొనసాగిస్తానని, ఆర్‌బిఐ పని యధావిధిగానే జరుగుతోందన్నారు.

అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ , టెలిఫోన్‌ ద్వారా అందుబాటులో ఉంటున్నట్టు వెల్లడించారు..

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/