‘యంగ్ టైగర్’కు కరోనా పాజిటివ్
హోమ్ ఐసొలేషన్ లో ఉన్నానని ఎన్టీఆర్ ట్వీట్
Hyderabad: ‘యంగ్ టైగర్’ ఎన్టీఆర్ కరోనా బారినపడ్డారు. ఇటీవల చేయించుకున్న పరీక్షలలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే తనకు పాజిటివ్ వచ్చిందని… ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నానని, ఆరోగ్యంగా కూడా ఉన్నానని ఎన్టీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అభిమానులు కంగారు పడవద్దని ఇప్పుడున్న కరోనా కాలంలో జాగ్రత్తగా ఉండాలని తన ఇటీవల కాలంలోతనను కలిసిన వారంతా కూడా కరోనా టెస్టులు చేసుకోవాలని కోరారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/