వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
ఎస్. కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు వైరస్ నిర్ధారణ
విజయనగరం: ఏపిలో తొలిసారి ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎస్.కోట వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు వైరస్ పాజిటివ్ వచ్చింది. ఆ వెంటనే ఆయన గన్ మెన్ కు పరీక్షలు జరిపించగా, ఆయనకూ వైరస్ సోకినట్టు తేలింది. ప్రస్తుతం కడుబండిని చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని ఓ గెస్ట్ హౌస్ కు తరలించారు. ఆయన కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేసి, కరోనా టెస్ట్ లు జరిపించాలని నిర్ణయించిన వైద్యాధికారులు, అందరి నమూనాలనూ సేకరించారు.
కాగా, కొన్ని రోజుల క్రితం కడుబండి అమెరికాలో పర్యటించి రాష్ట్రానికి వచ్చారు. ఆ సమయంలో అందరు విదేశీ ప్రయాణికులకు చేసినట్టే, ఆయనకూ వైద్య పరీక్షలు చేశారు. ఆయనలో వైరస్ లక్షణాలు అప్పుడు కనిపించలేదు. ఆ తరువాత ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడంతో పాటు రాజ్యసభ ఎన్నికల్లోనూ ఓటు వేశారు. అమెరికా నుంచి వచ్చిన తరువాత ఎందరో పార్టీ నాయకులు, కార్యకర్తలను కడుబండి శ్రీనివాసరావు కలసుకోవడంతో, ఆ పార్టీలో ఇప్పుడు కలకలం మొదలైంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/