మంత్రి హరీశ్‌ రావుకు కరోనా

Minister-Harish-Rao

హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కరోనా సోకింది. ఈవిషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. క‌రోనా వైర‌స్ వ‌ల్ల క‌లిగే ల‌క్ష‌ణాలు ఉండడంతో.. ప‌రీక్ష చేయించుకున్నాన‌ని, ఆ ప‌రీక్ష‌లో పాజిటివ్ రిపోర్ట్ వ‌చ్చిన‌ట్లు మంత్రి హ‌రీశ్ త‌న ట్వీట్‌లో తెలిపారు. అయితే త‌న ఆరోగ్యం బాగానే ఉన్న‌ట్లు మంత్రి చెప్పారు. గ‌త కొన్ని రోజుల నుంచి త‌న‌ను క‌లిసిన‌వారు క‌చ్చితంగా క‌రోనా ప‌రీక్ష చేయించ‌కోవాల‌ని మంత్రి త‌న ట్వీట్‌లో కోరారు. త‌న‌తో కాంటాక్ట్ అయిన‌ ప్ర‌తి ఒక్క‌రూ ఐసోలేట్ కావాల‌ని, కోవిడ్ ప‌రీక్ష చేయించుకోవాల‌ని మంత్రి హ‌రీశ్ కోరారు.


తాజా అంతర్జాతీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/