ఇద్దరు వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలకు కరోనా

చిత్తూరు ఎంపి రెడ్డప్ప, అరకు ఎంపి మాధవి

Coronavirus
Coronavirus

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఇద్దరు వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలకు కరోనా నిర్ధారణ అయింది. చిత్తూరు ఎంపి రెడ్డప్ప, అరకు ఎంపి మాధవిలకు కరోనా సోకినట్టు నిర్దారణ అయింది. దీంతో వీరిద్దరినీ ఐసోలేషన్ కు వెళ్లాలని అధికారులు సూచించారు. తదుపరి రెండు వారాలూ వీరు ఢిల్లీలోనే ఉండి, చికిత్సను పొందనున్నారు. కాగా, రెడ్డప్పకు ఎటువంటి లక్షణాలు లేకుండానే కరోనా సోకిందని తెలుస్తోంది. మాధవికి మాత్రం రెండు రోజులుగా జ్వరం ఉందని, జ్వరంతో బాధపడుతూనే ఆమె లోక్ సభ సమావేశాల నిమిత్తం వచ్చి, పరీక్ష చేయించుకోగా, పాజిటివ్ గా తేలిందని అధికారులు వెల్లడించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/