తెలంగాణలో కొత్తగా 1,198 కేసులు నమోదు
తాజాగా మరో ఏడుగురి మృతి
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజిృంభణ కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో 1,198 కరోనా కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 610 మందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,274కి చేరింది. తాజాగా మరో ఏడుగురు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 422కి పెరిగింది. సోమవారం మరో 1,885 మందిని డిశ్చార్జి చేయగా, ఇంకా 11,530 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ లో తెలిపారు.
రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న బెడ్ల వివరాలు..
17,081 పడకల్లో 2,122 భర్తీ అయ్యాయని, ఇంకా 14,959 ఖాళీగా ఉన్నాయని వివరించింది. ప్రత్యేకించి గాంధీ ఆసుపత్రిలో మొత్తం బెడ్లు 1,890 కాగా, ఇంకా 1,171 బెడ్లు ఖాళీగా అందుబాటులోనే ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్ లో వివరించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/