తెలంగాణలో కొత్తగా 1,473 కేసులు నమోదు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 55,532..మృతుల సంఖ్య మొత్తం 471

corona virus-telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా విజిృంభణ కొనసాగుతుంది. నిన్న రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో కొత్తగా 9,817 మంది నమూనాలను పరీక్షించగా, వారిలో 1,473 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం ప్రకటించింది. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 506 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 55,532 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 12,955 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 42,106 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 471కి చేరింది.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు…


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/