ఆసుపత్రి భవనం నుంచి దూకి కరోనా రోగి మృతి
గన్నవరం మండలంలో విషాదం
Gannavaram (Krishna District): హాస్పిటల్ భవనం నుంచి కరోనా పేషెంట్ దూకి ప్రాణాలు పోగొట్టుకున్న విషాద సంఘటన ఇది. గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని కోవిడ్ ఆసుపత్రి మూడో అంతస్తుపై నుండి కిందకు దూకి కరోనా రోగి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తేలప్రోలు శివారు కొత్తూరు గ్రామా నికి చెందిన పోలిబోయిన రోశయ్య (50)గా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/