2021లోనూ కరోనా వ్యాప్తి: ఎయిమ్స్
అన్ లాక్ తో జనం బయటకు రావడం మొదలు కావడంతో వ్యాప్తి తీవ్రత
New Delhi: కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పటిలో అదుపులోనికి వచ్చే పరిస్థితి లేదని ఢిల్లీలోని ఎయిమ్స్ పేర్కొంది.
2021లో కూడా కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది.
అన్ లాక్ తో జనం బయటకు రావడం మొదలు కావడం, గ్రామాలకు కూడా వైరస్ విస్తరించడం కారణంగా వ్యాప్తి తీవ్రత వచ్చే ఏడాది కూడా కొనసాగే అవకాశాలే మెండుగా ఉన్నాయని పేర్కొంది.
కరోనా నిర్ధారణ పరీక్షలు పెరగడం వల్ల కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికమౌతున్నదని వివరించింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/