జులై-సెప్టెంబర్‌లో ఐపీఎల్‌ 2020!

అవకాశాలను పరిశీలిస్తున్న బీసీసీఐ

IPL 2020
IPL 2020

ముంబయి: కరోనా వైరస్‌ దాడికి క్రీడా రంగం అతలాకుతలం అవుతుంది.ఈ నెల 29న మొదలవ్వాల్సిన పదమూడో సీజన్‌ను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడు కూడా లీగ్ మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు. దాంతో, మెగా లీగ్‌ను జులైజసెప్టెంబర్ మధ్య నిర్వహించే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. ఐసీసీ టోర్నీలతోపాటు వివిధ దేశాల మధ్య ఎక్కువ పోటీలు లేకపోవడంతో ఈ సమయమే లీగ్ నిర్వహణకు అనువుగా ఉందని భావిస్తోంది. ఐసీసీ ఫ్యూచర్‌‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌టీపీ) ప్రకారం సెప్టెంబర్‌‌ నెలలో ఆసియా కప్‌ జరగాల్సి ఉంది. అలాగే ఇంగ్లండ్ తమ స్వదేశంలో పాకిస్థాన్‌తో సిరీస్‌ ఆడుతుంది. అనంతరం ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. దాంతో పాటు జూన్, జులై మధ్య ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఖది హండ్రెడ్‌గ(వంద బంతుల మ్యాచ్‌) లీగ్‌ కోసం ప్రణాళికలు రచిస్తోంది.

ఈ లెక్కన ఇంగ్లండ్, పాకిస్థాన్ తప్ప మిగతా ప్రధాన దేశాలకు జులైజసెప్టెంబర్‌ పెద్దగా సిరీస్‌లు లేవు.
ఆసియా కప్‌ మినహాయిస్తే టీ20 వరల్డ్‌ కప్‌కు ముందు భారత్‌.. జూన్‌, జులైలో ఆస్ట్రేలియా, శ్రీలంకతో మూడేసి వన్డేల సిరీస్‌లను ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌ల్లో మార్పులు చేసి ఐపీఎల్‌ నిర్వహణకు మార్గం సుగమం చేయాలని బోర్డు పెద్దలు ఆలోచిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/