ఈ ఏడాది కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం లేదు

కరోనా వ్యాక్సిన్‌ పై డబ్ల్యూహెచ్‌ఓ కీలక వ్యాఖ్యలు

WHO

జెనీవా: కరోనా వైరస్‌ నియంత్రించేందుకు వ్యాక్సిన్ల‌ను అభివృద్ధిచేయ‌డంలో ప‌రిశోధ‌కులు మంచి పురోగ‌తి సాధిస్తున్నారన ఊహాగానాలు మొదలవుతున్నాయి. అయితే 2021 కంటే ముందు పూర్తిస్థాయిలో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగ అధిపతి మైక్‌ ర్యాన్ మీడియాతో మాట్లాడుతూ…‌ ప్రపంచంలోని పలు దేశాల్లో వివిధ వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని, కొన్ని మూడో దశ ప్రయోగాలకు చేరుకున్నాయని గుర్తు చేసింది. ఏ ఒక్కటీ విఫలం కాకపోవడం శుభపరిణామమని తెలిపింది. అయితే 2021 కంటే ముందు ప్రజలకు టీకా వేయడం సాధ్యపడకపోవచ్చు. వ్యాక్సిన్‌ పంపిణీలో ఎలాంటి తారతమ్యాలు ఉండబోవు’’అని మైక్‌ ర్యాన్ స్పష్టం చేశారు.

కరోనా విజృంభణ అత్యధికంగా ఉన్న అమెరికాతో పాటు పలు దేశాల్లో బడుల పునఃప్రారంభం సరికాదని ఆయన చెప్పారు. కరోనా సామాజిక వ్యాప్తి నియంత్రణలోకి వచ్చే వరకు విద్యా సంస్థలు తెరవకపోవడమే మంచిదని తెలిపారు. కాగా, రష్యాలోని సెషనోవ్‌ యూనివర్సిటీ టీకా ఆగస్టులోనే వస్తుందని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. చైనాలో మూడో దశ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయని కథనాలు వస్తున్నాయి. భారత్‌ బయోటెక్ కూడా‌ కోవాగ్జిన్‌ తొలి దశ మానవ ప్రయోగాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరిలోపే వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/