మరో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యెకు కరోనా

TRS MLA A Jeevan Reddy

నిజామాబాద్‌: తెలంగాణ కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంది. కాగా రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యెలు, మంత్రులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌కు వెళ్లారు. ఇక రాష్ట్రంలో కొత్తగా 1,764 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 58,908కి చేరింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/