వైద్య సిబ్బంది వంటి వారికే వ్యాక్సిన్‌..చైనా

ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ అవసరం లేదు..చైనా

corona vaccine

బీజింగ్‌: కరోనా వ్యాక్సిన్‌ కోసం యావత్‌ ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తమ దేశంలో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం లేదనే యోచనలో చైనా ఉంది. తాజాగా మీడియాతో చైనా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ డైరెక్టర్ మాట్లాడుతూ..కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బంది వంటి వారికే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయిస్తే సరిపోతుందని భావిస్తోంది. భవిస్తుందని తెలిపారు. కొవిడ్ విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి దశల వారీగా చైనాపై కరోనా దాడి జరిగిందని అన్నారు.

ఈ క్రమంలో తమ దేశం ప్రతిసారి దాన్ని నిలువరించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసే విషయంలో ఖర్చులతో పాటు లాభనష్టాల వంటి అంశాలను పూర్తిస్థాయిలో గుర్తించవలసి ఉందని చెప్పింది. భారీ స్థాయిలో వ్యాక్సిన్‌లు వేస్తూ వెళితే, అరుదుగా సంభవించే సైడ్ ఎఫెక్ట్స్‌ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. అందుకే, ప్రజలందరికీ టీకా వేయాల్సిన అవసరం లేదని అన్నారు. కాకపోతే భవిష్యత్తులో కరోనా తీవ్రత పెరిగితే ఈ విధానంలో మార్పు రావచ్చని ఆయన వ్యాఖ్యానించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/