నేపాల్‌ టూరిజం మంత్రికి కరోనా

వ్యక్తిగత డాక్టర్ కు కూడా కరోనా పాజిటివ్

nepal-tourism-minister-tested-corona-positive

నేపాల్‌: నేపాల్ టూరిజం మంత్రి యోగేశ్ భట్టారాయ్ కి కరోనా సోకింది. యోగేశ్ భట్టారాయ్ నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. గతంలో యోగేశ్ రాయ్ ఓ సందర్భంలో వ్యాఖ్యానిస్తూ నేపాల్ ను కరోనా రహిత దేశమంటూ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడాయనే కరోనా బారినపడడం విధి వైచిత్రి. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో తనతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అటు, ప్రధాని కేపీ శర్మ ఓలి సన్నిహితుల్లో చాలామంది కరోనా బారినపడ్డారు. వారిలో ఆయన డాక్టర్ కూడా ఉన్నారు. మీడియా వ్యవహారాల నిపుణుడు, ఫొటోగ్రాఫర్ కూడా వీరిలో ఉన్నారు. దాంతో ప్రధాని కోసం అత్యంత కట్టుదిట్టమైన ఆరోగ్య భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/