ప్రగతిభవన్‌ సిబ్బందిలో కరోనా కలకలం

దాదాపుగా 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్

corona virus
corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. తాజాగా కరోనా వైరస్ ప్రగతిభవన్‌ను తాకింది. వారం రోజుల్లో దాదాపుగా 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. పలువురు అవుట్ సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో వైద్యాధికారుల పర్యవేక్షణలో ప్రగతిభవన్‌ను శానిటైజేషన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా కేసులు పెరుగుతుండడంతో సిఎం కెసిఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. అయితే, ప్రగతిభవన్‌ ఉద్యోగులకు కరోనా అంశంపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో హైదరాబాద్‌ పరిధిలో లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం భావించింది. కానీ కరోనా కట్టడికి కేవలం లాక్‌డౌనే పరిష్కారం కాదని ప్రభుత్వం వెనక్కితగ్గింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/