భారత్లో 7 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
మొత్తం మృతుల సంఖ్య 20,160
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో భారత్లో 22,252 మందికి కొత్తగా కరోనా సోకిందని తెలిపింది. అదే సమయంలో 467 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 7,19,665 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 20,160కి పెరిగింది. 2,59,557 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,39,948 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను తెలిపింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/