అమెరికా తర్వాత ఇండియాలోనే ఎక్కువ టెస్టులు!
కరోనా నిర్థారణ పరీక్షలు చేయడంలో భారత్ రెండోస్థానం..వైట్ హాజ్ వెల్లడి
వాషింగ్టన్: కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేపడుతున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానం ఉందని, ఆ తర్వాత స్థానంలో భారత్ ఉందిని వైట్ హౌస్ ప్రకటించింది. ప్రపంచంలోని అన్ని దేశాలకన్నా అమెరికాలో ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, అందులో ఎటువంటి సందేహం లేదని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్నాన్నీ చెప్పారు. అమెరికా తర్వాత భారత్లో ఎక్కువ టెస్టులు నిర్వహిస్తున్నారని విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు. అమెరికా ఇప్పటి వరకు అత్యధికంగా 4.2 కోట్ల మందికి కోవిడ్19 పరీక్షలు నిర్వహించగా.. భారత్ 1.2 కోట్ల కరోనా టెస్టులు చేసి రెండో స్థానంలో ఉందని కైలీ మెక్నాన్నీ వెల్లడించారు. అమెరికాలో ఇప్పటి వరకు 35 లక్షల మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా 1,38,000 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 13.6మిలియన్లకు చేరగా.. 5,86,000 మంది మరణించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/