దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా

ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స

Purandeswari
Purandeswari

హైదరాబాద్‌: దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా సోకింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమె కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. ఆమెకు కొవిడ్‌19 సోకిందని వైద్యులు గుర్తించారు. అయితే, తనకు కరోనా సోకిన విషయంపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు. కాగా ఈ మధ్య కాలంలో ఏపి బిజెపి చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో పురంధేశ్వరి చురుగ్గా పాల్గొన్నట్లు సమాచారం.

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరి ఎన్నికైన తర్వాత ఆమె తన స్వగ్రామంలోనే ఉన్నారు. అయితే పార్టీ పదవి ఇచ్చిన నేపథ్యంలో ఆమెను అభినందించడానికి నాయకులు, అనేకమంది కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి పురంధేశ్వరిని కలిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా సోకినట్లు కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆమె ఢిల్లీ వెళ్లి వచ్చారు. అనారోగ్యంగా ఉండడంతో ఆమె పరీక్షలు చేయించుకోగా పాజిటీవ్ వచ్చింది. దీంతో వెంటనే ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియవచ్చింది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/