భారత్‌లో 24 గంటల్లో 8,392 పాజిటివ్‌ కేసులు

కరోనా కేసుల్లో ప్రపంచంలో 7వ స్థానానికి చేరిన భారత్‌

coronavirus-India
coronavirus-India

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. కరోనా కేసుల్లో భారత్‌ ప్రపంచంలోనే వైరస్‌ తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో 7వ స్థానానికి చేరింది. గత 24 గంటల్లో దేశంలో రికార్డుస్థాయిలో 8,392 మందికి కొత్తగా కరోనా సోకగా, 230 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,90,535కి చేరగా, మృతుల సంఖ్య 5,394కి చేరుకుంది. 93,322 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 91,819 మంది కోలుకున్నారు. ఈమేరకు ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/