ప్రపంచవ్యాప్తంగా కోటి 17 లక్షలు దాటిన కేసులు

మొత్తం మృతుల సంఖ్య 5,40,677

coronavirus- worldwide

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి విజృంభణ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. బాధితుల సంఖ్య కోటి 17 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,17,40,105 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 5,40,677 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 67,36,391 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల తీవ్రత నానాటికి పెరుగుతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 30,40,833 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,32,979 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి చికిత్స పొంది 13,24,947 మంది కోలుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/