ప్రపంచవ్యాప్తంగా కోటి 21 లక్షలు దాటిన కేసులు
మొత్తం మృతుల సంఖ్య 5,52,046
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మాహమ్మారి ఉద్ధృతి కొనసాగుతుంది. బాధితుల సంఖ్య కోటి 21 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,21,66,668 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 5,52,046 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 70,64,772 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 31,58,932 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,34,862 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి చికిత్స పొంది 13,92,679 మంది కోలుకున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/