భారత్లో ఒక్కరోజే 32,695 మందికి కరోనా
గత 24 గంటల్లో 606 మంది మృతి
న్యూఢిల్లీ: భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారత్లో 32,695 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 606 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 9,68,876కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 24,915కి పెరిగింది. 3,31,146 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 6,12,815 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,27,39,490 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,26,826 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ఈమేరకు ఈరోజు ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/