తెలంగాణలో కొత్తగా 983 మందికి కరోనా
మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,660
Hyderabad: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కొద్ది సేపటి కిందట వెల్లడించిన వివరాల ప్రకారం..
రాష్ట్రంలో కొత్తగా 983 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,660 కి చేరింది.
మృతుల సంఖ్య మొత్తం 551కి చేరింది. జీహెచ్ఎంసీలో 273 మందికి కొత్తగా కరోనా సోకింది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/