ప్రపంచవ్యాప్తంగా కోటి 46 లక్షలు దాటిన కేసులు

మొత్తం కేసులు..1,46,44,360, మొత్తం మరణాలు..6,01,911

coronavirus
coronavirus

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తన పంజా విరుతుంది. బాధితుల సంఖ్య కోటి 46 లక్షలు దాటింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,46,44,360 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 6,01,911 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 87,35,298 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 38,98,550 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,43,289 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి చికిత్స పొంది 18,02,338 మంది కోలుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/