ఏపీలో కరోనా విలయం
ఒక్క రోజే పది వేల కొత్త కేసులు
Amaravati: ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది.
గత 24 గంటల్లో అంటే నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకూ రాష్ట్రంలో కొత్తగా 10,276 మందికి కరోనా సోకింది.
అదే సమయంలో 97 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఈ రోజు నమోదైన పాజిటివ్ కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో 1,321, చిత్తూరులో 1,220, పశ్చిమగోదావరిలో 1,033కేసులు నమోదయ్యాయి.
అనంతపురం జిల్లాలో 1020 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో, ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,45,216కి పెరిగింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 3,189కి పెరిగింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/