ఒడిశాలో 50 వేలు దాటిన కేసులు
గువాహటి: ఒడిశాలో కరోనా ప్రభావం కొనసాగుతున్నది. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 50 వేల మార్కును 50,672కు చేరింది. అందులో 34,805 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మంగళవారం ఒక్కరోజే 1785 మంది వైరస్ను కోలుకున్నారు. మరో 15,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఒడిశాలో కరోనా మరణాలు కూడా క్రమంగా తప్పకుండా నమోదవుతూనే ఉన్నాయి. మంగళవారం కూడా కొత్తగా తొమ్మది మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 305కు చేరింది. ఒడిశా ఆరోగ్యశాఖ ఈ వివరాలను వెల్లడించింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/