తెలంగాణలో ఒక్కరోజే 983 కొత్త కేసులు
రాష్ట్రంలో 14 వేలు దాటిన కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. తాజాగా ఆదివారం 983 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 816 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది. రంగారెడ్డి జిల్లాలో 47 కేసులు, మంచిర్యాల 33, మేడ్చల్లో 29, వరంగల్ రూరల్ 19, వరంగల్ అర్బన్ 12, భద్రాద్రి కొత్తగూడెం 5, నల్లగొండ, కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం జిల్లాలో 3 చొప్పున, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్ 2 చొప్పున, సంగారెడ్డి, మహబూబ్నగర్, జనగామ, మెదక్, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాల్లో 1 చొప్పున నమోదయ్యాయి. చికిత్స పొందుతున్నవారిలో నలుగురు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 247కు పెరిగింది. ఆదివారం 3,227 నమూనాలను పరీక్షించగా, 2,244 మందికి నెగెటివ్ వచ్చింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/