భారత్‌లో కొత్తగా 82,170 పాజిటివ్‌ కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 60,74,703..మొత్తం మృతుల సంఖ్య 95,542

india- corona virus

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా 82,170 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 60,74,703కి చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 1,039 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 95,542కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 50,16,521 మంది కోలుకున్నారు. 9,62,640 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 7,19,67,230 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 7,09,394 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా ఏపి వార్తల కోసం కిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/