మహారాష్ట్రలో ఒక్కరోజే 7,975 కేసులు..233 మరణాలు

రాష్ట్రంలో ఇంకా 1,11,801 యాక్టివ్ కేసులు

Maharashtra-corona virus

ముంబయి: మహరాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. నిన్న ఒక్క రోజే 7,975 మంది కి కరోనా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినపడిన బాధితుల సంఖ్య 2,75,640కు చేరుకుంది. వీరిలో 1,11,801 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అలాగే, నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 233 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండడం ఊరటనిచ్చే అంశం. నిన్న 3,606 మంది రోగులు కొవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 1,52,613కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం రికవరీ రేటు 55.37 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/