భారత్‌లో కొత్తగా 67,708 పాజిటివ్ కేసులు

మొత్తం కేసుల సంఖ్య 73,07,098..మొత్తం మృతుల సంఖ్య 1,11,266

Corona cases in India 2,66,598
Corona cases in India 2,66,598

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా 67,708 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బాధితుల సంఖ్య 73,07,098కి చేరింది. ఇందులో 63,83,442 మంది బాధితులు కోలుకుని ఇంటికి చేరారు. మ‌రో 8,12,390 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో 680 మంది చ‌నిపోయారు. దేశంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాలు 1,11,266కు చేరాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో నిన్న‌టివ‌ర‌కు 9,12,26,305 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్) ప్ర‌క‌టించింది. ఇందులో నిన్న ఒక్క‌రోజే 11,36,183 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని వెల్ల‌డించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/