భారత్‌లో కొత్తగా 65,002 కేసులు నమోదు

మొత్తం కేసులు 25,26,193…మొత్తం మృతుల సంఖ్య 49,036

corona virus-india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 65,002 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 996 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 25,26,193కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 49,036 కి పెరిగింది. ఇక 6,68,220 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 18,08,937 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,85,63,095 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 8,68,679 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/