భారత్‌లో మరో 64,399 కేసులు

కోలుకున్న 14.80 లక్షల మంది

corona virus- india

న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతుంది.  ఈరోజు ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల వ్యవధిలో ఇండియాలో 64,399 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 21,53,011కు చేరింది. ఇదే సమయంలో కరోనా నుంచి 14,80,885 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. వ్యాధి కారణంగా ఇంతవరకూ 43,379 మంది కన్నుమూశారు. కాగా, ఇండియాలో వరుసగా మూడవ రోజు కూడా 60 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాడు 20 లక్షల మార్క్ ను అధిగమించిన మొత్తం కేసుల సంఖ్య, ఆపై రెండు రోజుల్లోనే 21.5 లక్షలను దాటేయడం గమనార్హం. ఇక శాంపిల్స్ సేకరణ సైతం అధికంగానే ఉంది. ఇంతవరకూ 2.41 కోట్లకు పైగా శాంపిల్స్ కలెక్ట్ చేసి పరీక్షించినట్టు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) గణాంకాలు వెల్లడించాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/