భారత్‌లో కొత్తగా 61,408 పాజిటివ్‌ కేసులు

మొత్తం కేసులు 31,06,349..మొత్తం మరణాలు 57,542

corona virus-india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 61,408 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 836 మంది మృతి చెందారని, 57,468 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 31,06,349 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 57,542కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 23,38,036 మంది కోలుకున్నారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 3,59,02,137 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 6,09,917 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/