భారత్‌లో ఒక్కరోజే 52,123 కొత్త కేసులు

మొత్తం కేసులు 15,83,792..మొత్తం మృతుల సంఖ్య 34,968

corona virus – india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారత్‌లో 52,123 మందికి కొత్తగా కరోనా సోకింది. కరోనా కేసులు ఒక్కరోజులో 50 వేలు దాటడం ఇదే తొలిసారి. అదే సమయంలో 775 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 15,83,792కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 34,968కి పెరిగింది. 5,28,242 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 10,20,582 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు మొత్తం 1,81,90,382 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 4,46,642 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. ఈ మేరకు ఈరోజు ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను తెలిపింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/