తెలంగాణలో కొత్తగా 2,381 కేసులు నమోదు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,81,627..మొత్తం మృతుల సంఖ్య 1,080

corona virus- Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 2,381 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,021 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,81,627కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,50,160 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,080కు చేరింది. ప్రస్తుతం 30,387 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 386, రంగారెడ్డి జిల్లాలో 227 కేసులు నమోదయ్యాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/