ఒడిశాలో కొత్తగా 1,977 కేసులు నమోదు

corona virus

భువనేశ్వర్‌: ఒడిశాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 1,977 కొత్త కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 54,630కు చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. ఇవాళ 10 మంది వ్యాధి బారిన పడి మృతిచెందగా ఇప్పటివరకు 324కు మంది మృత్యువాత పడినట్లు తెలిసింది. 37,900 మంది రోగులు పూర్తిగా కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి కాగా 16,353 మంది ప్రస్తుతం కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఒడిశాలోని ఖోర్దా జిల్లాలో అత్యధికంగా 332 కరోనా కేసులు నమోదు కాగా గంజాంలో 280, మయూరభంజ్‌లో 120 కేసులు నమోదయ్యాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/