తెలంగాణలో కొత్తగా 1,897 కేసులు నమోదు

జీహెచ్ఎంసీ పరిధిలో 479 కేసుల నమోదు

corona virus- Telangana

హైదరాబాద్‌:  తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది.  ఈ రోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న 22,972 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,897 కేసులు వెలుగు చూశాయి. ఇంకా 1221 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 84,544కు పెరిగింది. అలాగే, నిన్న 9 మంది కరోనాకు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 654కు పెరిగింది. మహమ్మారి కోరల నుంచి నిన్న 1,920 మంది బయటపడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 61,294కు చేరుకోగా, ఇంకా 22,596 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. తాజా కేసుల్లో 479 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెలుగు చూడగా, రంగారెడ్డి జిల్లాలో 162, సంగారెడ్డిలో 107, వరంగల్‌‌లో 87, పెద్దపల్లిలో 62 కేసులు బయటపడ్డాయి.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/