తెలంగాణలో ఒక్కరోజే 1,892 కొత్త కేసులు

రాష్ట్రవ్యాప్తంగా 20 వేలు దాటేసిన కేసులు

Coronavirus
Coronavirus

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. నిన్న 1,892 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. తాజా కేసుల్లో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,658 కేసులు అంటే 87.6 శాతం కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మొత్తం 5,965 మందికి పరీక్షలు చేయగా ఈ కేసులు బయటపడ్డాయి. 4,073 మందికి నెగటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 20 వేల మార్కును దాటేసి 20,462గా నమోదైంది. 9,984 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 1,126 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఈ మహమ్మారిని నుంచి మొత్తం 10,195 మంది కోలుకోగా, తాజాగా 8 మంది కరోనాతో మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 283కు పెరిగింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,04,118 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/