తెలంగాణలో మరో 1,764 కొత్త కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 58,906
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1,764 కేసులు మంగళవారం నమోదయ్యాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 18,858 నమూనాలను పరీక్షించగా, వారిలో 1,764 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 12 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 509 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 58,906 అని పేర్కొంది. ఇప్పటివరకు 43,751 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 492 కి చేరింది.
ఈ మేరకు ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/