తెలంగాణలో కొత్తగా 1,451 కేసులు నమోదు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,20,675

corona virus – telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 1,451 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,983 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,20,675 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,96,636 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,265 కు చేరింది. ప్రస్తుతం 22,774 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 18,905 మంది హోం క్వాంరంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీలో 235 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 104 కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజులో తెలంగాణ వ్యాప్తంగా 42,497 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 37,89,460 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ మేరకు ఈరోజు ఉదయం ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/